వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ‘చేయూత’ పథకంలో భాగంగా చేపట్టిన సజీవ నిర్ధారణ సర్వేలో వందలాది మంది మృతుల పేర్లపై పింఛన్లు అందుతున్నట్లు గుర్తించారు. 1,807 మంది ఏళ్ల క్రితమే మరణించినా, వారి ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్లు తేలింది.
అధికారులు ఇప్పటివరకు 74.41 శాతం సర్వేను పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి వీరికి పింఛన్లు నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు కాజేసిన డబ్బులను రికవరీ చేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
Comments
Loading comments...

