వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలోని టి.జి.ఐ. కంపెనీలో పనిచేస్తున్న సుమారు 400 మంది కార్మికులు తమ పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు శాశ్వత సెటిల్మెంట్ చేయాలని కోరుతూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
తమ సమస్యలను ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

