వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం (D)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి చెందాడు. సంతకవిటి మండలం కొత్తూరుకు చెందిన కే.నారాయణరావు (21)కి ఆగస్టు 30న వివాహమైంది. అత్తింటివారు కానుకగా ఇచ్చిన బైక్పై బంధువు జగన్నాథరావుతో కలిసి రాపాక వెళ్లాడు.
అనంతరం వాహనపత్రాలు తీసుకుని తిరిగి వస్తుండగా పొందూరు మండలం లోలుగు పాఠశాల సమీప మలుపులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Loading comments...

