వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేట రోడ్డులోని చెంతలబోరు సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై ఏటూరునాగారం పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,18,430 నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

