వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ శాంతిని కోరుతూ ప్రకాశం జిల్లా పొదిలిలో ఆదివారం మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. శివాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పెద్ద, చిన్న బస్టాండ్ల మీదుగా సాగింది.
‘యుద్ధం వద్దు-శాంతి ముద్దు’ నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. సంస్థ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

