వార్తలకు తిరిగి వెళ్లండి

బతికెపల్లి గ్రామ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బింగి తిరుపతి, పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
సంఘ అభివృద్ధితో పాటు సమాజ సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. ప్రధాన కార్యదర్శి స్వర్గం సత్తయ్య, ఉపాధ్యక్షుడు కోమకుల రమేష్, కోశాధికారి నల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

