వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలంలోని పది గ్రామాల్లో పోలీసులు బుధవారం పల్లెనిద్ర చేశారు. అలజంగిలో పట్టణ సీఐ కె.నారాయణరావు, కారాడలో ఎస్ఐ కొండలరావు, మరో ఎనిమిది గ్రామాల్లో ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ పల్లెనిద్ర చేసి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. మహిళలను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

