వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. వనమహోత్సవం పురస్కరించుకొని మంగళవారం మండలంలోని ధర్మారం గ్రామ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
పచ్చదనం అతి ముఖ్యమైందని, దానికి కాపాడుకోవాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

