వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసంలో ప్రధాని మోదీ పర్యటన ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిందని ఆయన భార్య అన్నా లెజినోవా పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ను పరామర్శించిన ప్రధానికి, తన భర్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె ప్రామిస్ చేశారు.
ఈ అరుదైన భేటీకి సంబంధించిన ఫోటోలను అన్నా సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ క్షేమం కోరుతూ మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం విశేషం.
Comments
Loading comments...

