వార్తలకు తిరిగి వెళ్లండి

ఏళ్ల క్రితమే వివాహమైన తొమ్మిది జంటలు కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో బుధవారం తమ జీవిత భాగస్వాములనే మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సిద్ధాంతి సూచనతో మారు మాంగల్యధారణ చేసుకున్నట్లు వారు తెలిపారు.
జీలకర్ర బెల్లం, మూడుముళ్లు, ఏడడుగులు, తలంబ్రాలు, దండల మార్పిడి సహా వివాహ తంతు సంప్రదాయబద్ధంగా సాగింది. వేడుకలో ఆయా జంటల పిల్లలు సందడి చేశారు.
Comments
Loading comments...

