వార్తలకు తిరిగి వెళ్లండి
జరిమానా డబ్బుతో పంచాయతీ పెద్దల విందు

ఝార్ఖండ్లో మూడేళ్ల చిన్నారిపై రేప్ చేసిన నిందితుడికి పంచాయతీ పెద్దలు లక్ష రూపాయల జరిమానా విధించారు. నిందితుడు తక్షణమే చెల్లించిన రూ.20 వేల డబ్బుతో ఆదివారం రాత్రి గ్రామ పెద్దలు మద్యం, మాంసంతో విందు పార్టీ చేసుకున్నారు.
ఈ దారుణ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు విందు చేసుకుంటున్న గ్రామ పెద్దలతో పాటు అక్కడే ఉన్న నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...