Back to feed
ఏడాదిలోపు పాలమూరు పూర్తి: మంత్రి ఉత్తమ్
Vikram Singh Jun 06, 2026 10:16 AM మహబూబ్నగర్ 7 viewsabout 2 hours ago

వచ్చే ఏడాదిలోపు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఉదండాపూర్ వరకు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జడ్చర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యలను ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు కల్పించడంలో తాము ముందున్నామని, వడ్ల కొనుగోళ్లలో రికార్డు సృష్టించామని వెల్లడించారు.
Comments
Loading comments...



