వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం మొండెంఖల్లు ప్రధాన జంక్షన్ సమీప ఆశ్రమ పాఠశాలకు వెళ్లే మార్గంలో బురద పేరుకుపోయి నడవడానికి ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. వీధికాలువలో చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీరు వెళ్లక అపారిశుద్ధ్యంగా తయారైందన్నారు.
అలాగే ఆశ్రమ పాఠశాల కూడా ఉందని ఇలా ఉంటే దోమలు వ్యాప్తి చెంది పిల్లలు అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

