వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఓ వ్యాపారి దుకాణంలో పాము చొరబడడంతో కలకలం రేగింది. పాము చొరబడటంతో కార్మికులు, వస్తువుల కోసం వచ్చిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ బాక్స్లో పాము కనిపించింది.
దీంతో వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించగా, అతడు చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా బయటకు తరలించారు.
Comments
Loading comments...

