వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో నడగాం గ్రామానికి చెందిన లుకలాపు గోవిందరావు పాము కాటుకు గురయ్యాడు. శనివారం పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్లగా రక్తపొడి పాము కాటువేసింది.
దీంతో అస్వస్థతకు గురైన గోవిందరావును కుటుంబ సభ్యులు 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...

