Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడెపైనే సోదరుడికి రాఖీ

Follow Udayam on Google
madhu Aug 27, 2026 10:55 AM ములుగుGeneral
పాడెపైనే సోదరుడికి రాఖీ - Udayam
మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన మోటపోతుల రమేష్ (36) అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమయాత్రలో దింపుడుకళ్లం వద్ద రమేష్ అక్క మృతదేహానికి రాఖీ కట్టి కన్నీరుమున్నీరుగా విలపించింది. రక్షాబంధనం రోజున జరగాల్సిన వేడుక ఇలా విషాదంగా మారడంతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. పది రోజుల క్రితమే తండ్రి, గతంలో తమ్ముడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి.

Comments

G
Loading comments...