వార్తలకు తిరిగి వెళ్లండి
అయినవారున్నా అనాథలుగానే..

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కన్నవారే వదిలేయడంతో పలువురు వృద్ధులు అనాథలుగా మారుతున్నారు. కొడుకులను ప్రయోజకులను చేసినా, ప్రమాదంలో గాయపడి రిమ్స్లో చేరిన నర్సిములు అనే వృద్ధుడిని పట్టించుకునేందుకు భార్య, పిల్లలు రాలేదు.
చికిత్సకు భయపడి కొందరు రోగులను ఆసుపత్రి వద్దే వదిలేసి వెళ్తుండటంతో సిబ్బందే సేవలు అందిస్తున్నారు. ఇలా చేరిన పలువురు మృతి చెందగా స్వచ్ఛంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.
Comments
Loading comments...