వార్తలకు తిరిగి వెళ్లండి
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లపై తలసాని సమీక్ష

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
ఈ నెల 21న జరగబోయే అమ్మవారి కల్యాణం, 22న నిర్వహించే రథోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో వినోద్ రెడ్డి శుక్రవారం తలసానికి అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...