వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంకు చెందిన బైసా అశోక్కుమార్కు చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ మూడో ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి అరవ ప్రవీణ్ తీర్పు చెప్పారు. చల్లగుండ్ల రఘుకు రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.
2016లో రఘు వద్ద రూ.8 లక్షలు రుణంగా తీసుకున్న అశోక్కుమార్ 2018లో రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. సంతకం సరిపోలకపోవడంతో రఘు కోర్టును ఆశ్రయించగా విచారణలో నేరం రుజువైంది.
Comments
Loading comments...

