వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లిలోని లోటస్ ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా డ్రైనేజీ బ్లాక్ కావడంతో మున్సిపల్ సిబ్బంది మ్యాన్హోల్ తెరిచి శుభ్రం చేస్తుండగా ఈ ఘటన వెలుగుచూసింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

