Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నత్తనడకన పనులు ప్రజలకు తప్పని ఇబ్బందులు

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 1:36 PM కామరెడ్డిGeneral
నత్తనడకన పనులు ప్రజలకు తప్పని ఇబ్బందులు - Udayam
ఎల్లారెడ్డి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రధాన మురుగు కాలువ నిర్మాణం కోసం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన రహదారి నుంచి కాలనీలకు వెళ్లే మూడు మార్గాలను తవ్వి వదిలేయడంతో 13 రోజులు గడిచినా పనులు పూర్తి కాలేదు. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ హైవే అధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...