వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ మండలంలోని నసీరాబాద్ శివారులో రాంపూర్ వాసులు పశువులను పంటలపైకి వదలడంతో రైతులు రాములు చిన్నయ్య, మల్లేష్, శ్రీనివాస్ తదితరుల పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అడ్డుకున్న నసీరాబాద్ ప్రజలపై రాంపూర్ వాసులు జేసీబీతో అడ్డం పెట్టి గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తహశీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్ స్పందించి శాంతింపజేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముకేష్ ఆధ్వర్యంలో MROకు వినతి పత్రం అందజేశారు.
Comments
Loading comments...

