వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ కృత్తికా శుక్లా పరిశీలించారు. ఆగస్టు 15న జరగనున్న వేడుకల కోసం చేపట్టిన ట్రయల్ రన్ను ఆమె ప్రత్యక్షంగా సమీక్షించారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కీలక అంశాలను స్వయంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు అందించారు.
Comments
Loading comments...

