వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాల్లేవు.. కరవు పిడికిలిలో ఖరీఫ్

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 46,055 హెక్టార్ల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 4.28 శాతం (1,970 హెక్టార్లు) మాత్రమే పంటలు సాగయ్యాయి.
ఎల్నినో ప్రభావంతో రాయచోటి, పీలేరు, మదనపల్లె తదితర ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం తీవ్రమవ్వడంతో రైతులు ఉలవలు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...