వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందని సొంత పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే పోక్సో నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై బయటకు వచ్చి ఘోరానికి ఒడిగట్టాడని ఆమె ఆరోపించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

