వార్తలకు తిరిగి వెళ్లండి
కుంగలేదు.. బుంగలు మాత్రమే: ఈటల రాజేందర్

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పిల్లర్లు కుంగిపోలేదని, కేవలం బుంగలు మాత్రమే పడ్డాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సాధారణ చెరువులకు కూడా బుంగలు పడతాయని, ఇసుక బస్తాలతో వాటిని అరికట్టవచ్చని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో గుర్తుచేశారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో, ఆ బ్యారేజీలలో నీటిని నింపేందుకు అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఎస్ఏను ఎందుకు అడగడం లేదని ఈటల ప్రశ్నించారు.
Comments
Loading comments...