వార్తలకు తిరిగి వెళ్లండి
మత్స్యగిరి కోనేటిలో నామాల చేపలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మత్స్యగిరిపై 12వ శతాబ్దానికి చెందిన స్వయంభు శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి అలరారుతున్నారు. ఇక్కడ కోనేటిలోని చేపలకు శ్రీ వైష్ణవ నామాలు ఉండటం, స్వామివారు గుహలో మత్స్య రూపంలో దర్శనమివ్వడం ప్రత్యేక విశేషం.
ఇరుకైన గుహ మార్గం గుండా వెళ్లి దర్శించుకునే ఈ క్షేత్రంలో ప్రతి ఏటా కల్యాణ మహోత్సవాలు, నరసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి.
Comments
Loading comments...