వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలో ఊరపండుగ సందర్భంగా గ్రామదేవతల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఉద్యోగాలు, చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం స్వగ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
సార్గమ్మ, పోచమ్మ తదితర దేవతామూర్తులకు భక్తులు పూజలు నిర్వహించారు. డప్పు విన్యాసాలు, పోతురాజుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఊరపండుగ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పింది.
Comments
Loading comments...

