వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జీజీహెచ్లో పగిలిన అద్దాలు, శిథిల భవనాలు, పెచ్చులూడుతున్న పైకప్పులు, నీటి వృథాతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులకు రూ.1.50 కోట్లు మంజూరైనా పనులు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
200కు పైగా మరుగుదొడ్లలో 120 పనులు పూర్తికాగా, మరో 80 మరమ్మతులు మిగిలాయి. అద్దాల పనులకు టెండర్ వేసినా గుత్తేదారులు ముందుకు రాలేదు. అధికారులు మిగిలిన పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

