వార్తలకు తిరిగి వెళ్లండి
నిత్యవసర వస్తువుల వినియోగదారుల యూనియన్ ఏర్పాటు

చిత్తూరు: బియ్యం, వంటనూనెలు, వంటగ్యాస్, పప్పులు, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నిత్యావసర వస్తువుల వినియోగదారుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులోని ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులకు విజ్ఞప్తి చేశారు.నిత్యావసర వస్తువుల వినియోగదారుల యూనియన్ను ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడిగా మురుకంబట్టు పళని, కార్యదర్శిగా పి. చైతన్య, లీగల్ అడ్వైజర్గా హైకోర్టు న్యాయవాది అబ్దుల్ అజీజ్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...