వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 22A (నిషేధిత భూముల జాబితా) ముసుగులో ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తలపెట్టిన రెండు రోజుల మహా దీక్షను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ దీక్ష సన్నద్ధతపై నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అధ్యక్షతన ఆదివారం నిర్మల్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

