Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌ లో నూతన భరోసా కేంద్రం ప్రారంభం.

సందీప్ Jul 08, 2026 5:05 AM నిర్మల్ 6 viewsabout 1 hour ago
నిర్మల్‌ లో నూతన భరోసా కేంద్రం ప్రారంభం. - Udayam Digital
మహిళలు, చిన్నారులకు భద్రత, రక్షణ, న్యాయ సహాయం, మానసిక పరామర్శ, పునరావాస సేవలను ఒకేచోట అందించేందుకు నిర్మల్ రూరల్ మండలం ఎల్లపెల్లి గ్రామ శివారులో ఎన్‌టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన నూతన భరోసా కేంద్రాన్ని మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా ఎస్పీ జానకి షర్మిల భరోసా కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, చిన్నారులకు పోలీసు, వైద్య, న్యాయ, మానసిక కౌన్సెలింగ్, పునరావాస సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...