Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.360 కోట్లతో రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు

రాజిత దేవి Jul 08, 2026 5:47 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
రూ.360 కోట్లతో రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు - Udayam Digital
రాష్ట్రంలో రూ.360 కోట్లతో ఆర్డీవో, తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు కూడా జారీ అయ్యాయి. తహసీల్దార్, ఆర్డీవో భవనాలకు రూ.263 కోట్లు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రూ.97 కోట్లు కేటాయించారు. ఒకే నమూనాలో చేపట్టే ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...