వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ ఆర్టీసీ డిపోలో ఈనెల 9న కార్గో వస్తువుల వేలం

ఆర్టీసీ నిర్మల్ డిపో కార్గో విభాగంలో చాలా కాలంగా నిల్వ ఉండి, సంబంధిత యజమానులు తీసుకెళ్లని పాత కార్గో వస్తువులను ఈ నెల 9న బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డిపో మేనేజర్ కే. పండరి మంగళవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వేలం జూలై 9న ఉదయం 11 గంటలకు నిర్మల్ ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్వహించబడుతుందని తెలిపారు. వ్యాపారులు, ప్రజలు, ఆసక్తి గల కొనుగోలుదారులు నిర్ణీత సమయానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని సూచించారు.
Comments
Loading comments...