వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జూన్ 6 నుండి 12 వరకు వారం రోజుల పాటు ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, ఎన్సీసీ, క్రీడా మైదానం వంటి అధునాతన వసతులు ఉన్నాయని తెలిపారు. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్లు కూడా అందుతాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

