వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ వైద్యరంగంలో సరికొత్త విప్లవం

రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేస్తూ 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునీకరిస్తూ రామగుండం, శంషాబాద్లలో వంద పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. విదేశాల్లో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టమైన విజన్తో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...