Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుండి అకౌంట్లలోకి కొత్త పెన్షన్లు

నవీన్ రెడ్డి Jul 17, 2026 10:19 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago
ఆగస్టు 15 నుండి అకౌంట్లలోకి కొత్త పెన్షన్లు - Udayam Digital
రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుండి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా లబ్ధి చేకూర్చాలని ఆమె అధికారులను ఆదేశించారు. అన‌ర్హుల ఏరివేతలో భాగంగా పెన్షన్ పొందుతూ మరణించిన వారి పేర్లను జాబితా నుండి తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...