వార్తలకు తిరిగి వెళ్లండి
వానల కోసం సర్కార్ సరికొత్త నిర్ణయం

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, సమృద్ధిగా వానలు కురవాలని కోరుతూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ, అజారుద్దీన్లకు ఆయన లేఖలు రాశారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో హోమాలు, యాగాలు నిర్వహించాలని, అలాగే మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...