వార్తలకు తిరిగి వెళ్లండి
నేడే రామాలయం ట్రస్టు కొత్త సీఈవో ఎంపిక

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక సమావేశం బుధవారం అయోధ్యలో జరగనుంది. కొత్త సీఈవో ఎంపిక, రాజీనామా చేసిన చంపత్రాయ్ స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శి నియామకం, ఖాళీల భర్తీపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు పురోగతిని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతర కీలక అంశాలపైనా చర్చించనున్నట్లు స్వామి పరమానంద గిరి తెలిపారు.
Comments
Loading comments...