వార్తలకు తిరిగి వెళ్లండి

నెల రోజుల్లో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉందని ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
ధర్మవరం పట్టణంలోని 28వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఆయన పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ పింఛన్లు అందజేశారు. ప్రతి నెల ఒకటవ తేదిన పింఛన్లు ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.
Comments
Loading comments...

