వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ యూజీ-2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు వ్యవహారం దేశానికే సిగ్గుచేటని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమర్శించారు. కేంద్రం నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యా రంగంలో భారత్ తీరు అధ్వాన్నంగా ఉందని, దీనిపై కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే విమర్శించే ప్రధాని, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

