వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోని నేవీ నగర్లో నావికాదళానికి చెందిన నావికుడు, ఆయన భార్య, ఇద్దరు చిన్నారులు నివాసంలో అనుమానాస్పదంగా మృతిచెందారు. నావికుడు ఉరివేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
రెండు నెలలు, మూడేళ్ల చిన్నారులు విషప్రయోగంతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

