వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేయి పాన్యోర్ జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో పాటు పద్దెనిమిది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
మరోవైపు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలువురు ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోగా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

