వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దరిపల్లి చంద్రం ఆధ్వర్యంలో డా. ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంపొందించే భాండాగారాలని పేర్కొన్నారు. ఆయన పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

