వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ పెద్దగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఏటా శ్రావణ మాసంలో ఒక్కరోజే పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 29న పూజలకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు చేశారు.
స్థానికుల కథనం ప్రకారం దాదాపు 900 ఏళ్ల క్రితం పెద్దగుట్టపై స్వామివారి ఉనికి వెలుగులోకి వచ్చింది. శ్రావణంలో కోనేరు నీటితో అభిషేకం చేస్తారు. జిల్లా నలుమూలలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి భక్తులు తరలివస్తారు.
Comments
Loading comments...

