వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లాలోని పుష్కర ఘాట్కు తన కుమారుడు దేవాన్ష్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడం హాస్యాస్పదమని, ఇటువంటి సంస్కృతిని తాను అస్సలు ప్రోత్సహించనని ఆయన స్పష్టం చేశారు.
అలాంటి పనులకు దూరంగా ఉండాలని అధికారులకు, స్థానిక నాయకులకు కరాఖండిగా ఆదేశాలు జారీ చేసినట్లు లోకేష్ తెలిపారు. ప్రజా ఆస్తుల విషయంలో వ్యక్తిగత పేర్లు వద్దని ఆయన స్పష్టం చేయడంతో ఈ వివాదం ముగిసింది.
Comments
Loading comments...

