వార్తలకు తిరిగి వెళ్లండి
నల్లమల తిరుపతి విశేషం

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలోని రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం నల్లమల తిరుపతిగా ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు 490 ఏళ్లుగా దళితులే అర్చకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
క్రీ.శ.1536లో పల్నాటి రాజులు ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పంచమి రోజున స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
Comments
Loading comments...