వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం బైక్ను ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గోల్కొండకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్గా గుర్తించారు.
ఫస్ట్ క్లబ్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న సమద్ నార్సింగి నుంచి గండిపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం నార్సింగి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

