వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ ఎర్ర గణేష్ అలియాస్ గంజి(25) మంగళవారం హత్యకు గురయ్యాడు. కన్నమ్మ తల్లి జాతర సందర్భంగా స్నేహితులతో ఏర్పడిన విభేదాలే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
గంజి గతంలో పీడీ యాక్ట్ కింద ఎనిమిది నెలలు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
