వార్తలకు తిరిగి వెళ్లండి
గంజాయి, యువతి గొడవ: హత్య

పసుమాములకు చెందిన నిషాని సుహాస్(22) అనే యువకుడిని స్నేహితులే దారుణంగా కొట్టి చంపారు. గంజాయి వ్యాపారంలోని ఆర్థిక లావాదేవీల వివాదంతో పాటు, ఒక యువతి విషయంలో ఇన్స్టాగ్రామ్లో జరిగిన గొడవలే ఈ ఘోర హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
నమ్మించి అర్ధరాత్రి వేళ తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. చనిపోయిన సుహాస్ తల్లికి ఏకైక కుమారుడు కాగా, నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Loading comments...